ద్రోణ అమరావతి ప్రతినిధి
గుంటూరు జిల్లా తాడేపల్లి (మ) పెనుమాకలోని గిరిజన కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్, భార్యకు సి ఆర్ డి ఏ పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు. వాళ్ల ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా.. కేటాయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
