ద్రోణ కామారెడ్డి జిల్లా ప్రతినిధి
షాదీముబారక్ పథకంలో మంజూరైన 5 చెక్కులను బాన్సువాడ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు గురువారం
మాజీ మంత్రి, మాజీ శాసనసభ సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసిల్దార్ వరప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
