నిమ్జ్ భునిర్వసితులతో సమావేశంలో పాల్గొన్న
భూ నిర్వాసితులకు త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు చెల్లింపుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జహిరాబాద్ యంపి సురేష్ కుమార్ షేట్కర్ స్పష్టం చేశారు.మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ చంద్రశేఖర్ భూ నిర్వాసితుల సమావేశంలో పాల్గొన్నారు.
ఝరసంగం మండల కేంద్రంలో ఎల్గోయ్ గ్రామ నిమ్జ్ బాధిత రైతులతో *యంపి సురేష్ కుమార్ షేట్కర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పరంగా అన్నివిధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. భూ పరిహారం చెల్లించాలని రైతులు కోరడం తో బాదితులందరికి నేరుగా వారి బ్యాంకు ఖాతా లో డబ్బులు జమ చేయనున్నట్టు తెలిపారు. నిమ్జ్ రాకతో ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
