ద్రోణ హైదరాబాద్
రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గం లోని పలు రవాణా అంశాలపై మంత్రి కి విన్నవించారు.ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టకి ప్రతి సోమవారం భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వలన భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నదని ఆలయ కమిటీ సభ్యులు తన దృష్టికి తెచ్చారన్నారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి త్వరలో బస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఆర్మూర్ పట్టణంలోని బస్ డిపో లో బస్ ల కొరత ఉందని, కొత్త బస్ లను సంక్షన్ చేయాలని కోరడం జరిగింది.త్వరలో కొత్త బస్ లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి.
