Thursday, February 26, 2026

ఎంపీ సురేష్ షెట్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాసుల బాలరాజ్

ద్రోణ హైదరాబాద్

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా కాసుల బాలరాజ్ కు నియామక ఉత్తర్వులు రావడంతో సోమవారం ఎంపీ సురేష్ శెట్కార్ ను హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని దానికి నిదర్శనమే కాసుల బాలరాజుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, నగేష్ శెట్కార్, మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular