తేది :08.07.2024
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఎమ్మెల్యే
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
నగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి అమ్మవారిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ,మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డా. కడియం కావ్య కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మహామండపంలో అర్చక బృందం మహా ఆశీర్వచనం నిర్వహించి శేషవస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందచేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
