ద్రోణ అమరావతి ప్రతినిధి
జగన్తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్కుమార్పై కేసు నమోదు
సెక్షన్ 120B, 166, 167, 197, 307,
326, 465, 508(34) ప్రకారం కేసు
రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ.
కేసులో ఏ3గా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు
ఏ1గా మాజీ డీజీ సీఐడీ సునీల్కుమార్
ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు
ఏ4గా విజయ్పాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేరు .మే 14న జరిగిన ఘటనపై
నిన్న సాయంత్రం ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు.బైపాస్ సర్జరీ జరిగినట్టు చెప్పినా,ఛాతిపై కూర్చుని తనను చంపడానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదు.ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టమొచ్చినట్టు కొట్టారని ఆరోపణ.తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై ఫిర్యాదు పోలీసులు ఒత్తిడి మేరకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణ.జగన్ను విమర్శిస్తే చంపుతామని సునీల్కుమార్ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న రఘురామకృష్ణ.
