కలం నిఘా :న్యూస్ రిపోర్టర్
ద్రోణ హైదరాబాద్:జులై 13
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.
కొందరు రిటైరైన ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది.
ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన వృద్ధురాలు రూ.1.70 లక్షలు తిరిగి ఇవ్వాలని అధికారులు నోటీసులిచ్చారు.
