Wednesday, February 18, 2026

గీత కార్మికులకు రేవంత్ సర్కార్ తీపి కబురు

కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ

ద్రోణ హైదరాబాద్

తెలంగాణలోని కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గీత కార్మికులు ఎవరు చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను వారికి అందజేయనుంది.
”కాటమయ్య రక్ష” పేరుతో వారికి ఈ కిట్లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శ్రీకార చుట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో జరిగే సభలో గౌడ సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కిట్లను స్వయంగా అందించనున్నారు. అనంతరం వారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సహ పంక్తి భోజనం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది గీత కార్మికులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఆ తర్వాత విడుతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులందరికి కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయనున్నారు. అయితే చెట్లు మీదకు వెళ్లి కల్లు తీయడం అనేది చాలా ప్రమాదకరమైన వృత్తి అనే చెప్పాలి. ప్రమాదవశాత్తూ చెట్లపై నుంచి పడి కల్లుగీత కార్మికులు తీవ్ర గాయాలపాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.గీతా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కాటమయ్య రక్షణ కవచ్ పనితీరు మరియు ఎలా ఉపయోగించాలి అనే అంశం పై
తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ నేతృత్వంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల ప్రత్యేకంగా రూపొందించారు. ఐఐటీ హైదరాబాద్, ఒక ప్రైవేట్ కంపెనీ సహకారంతో వీటిని అభివృద్ది చేశారు. గీతకార్మికులను ప్రమాదాల బారినపడకుండా చూసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని రూపొందించారు. ఇక, కాటమయ్య రక్షణ కిట్లలో 6 పరికరాలు ఉంటాయి. రోప్‌లు, క్లిప్‌లు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్స్ ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న మోకు తరహాలోనే సులువుగా తాళ్లు ఎక్కేందుకు ఆ కిట్టు దోహదపడుతుంది. ఇక, బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గత 15 రోజులుగా 50 మందితో ఈ కిట్లపై లష్కర్‌గూడలో ట్రయల్ రన్ నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular