ద్రోణ నిజామాబాద్ జిల్లా:జులై 20
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి మూడేళ్ల బాలుడు కిడ్నాప్నకు గురయ్యాడు.
మాక్లూర్ మండలం మానిక్ భండార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
రాత్రి సమయంలో తన మూడేళ్ల కొడుకుతో ఆస్పత్రి కారిడార్లో నిద్రించాడు. తెల్లవారుజామున నిద్రలేచే సరికి తన మూడేళ్ల కొడుకు కనిపించలేదు.దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసులు.
